telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే రాష్ట్రానికి నష్టం: మంత్రి బొత్స

రాష్ట్ర విభజన కన్నా ఏపీకి ఐదేళ్లుగా చంద్రబాబు సీఎ గా ఉండడం వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తన హయాంలో రాజధాని అభివృద్ధికి సింగపూర్ తో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కుదుర్చుకున్న ఒప్పందం గురించి చంద్రబాబు వివరించి చెబుతున్న సమయంలో వైసీపీ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స స్పందిస్తూ గతంలో ఎంఓయూలు కుదుర్చుకున్న సింగపూర్ ప్రతినిధులు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు మూడుసార్లు తమను కలిశారని చెప్పారు. గతంలో కుదర్చుకున్న ఎంఓయూలపై స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. చంద్రబాబునాయుడు చేసింది తప్పని అన్నారు. వాటిని సమర్థించుకోవడానికి డొంక తిరుగుడు ధోరణిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘స్విస్ ఛాలెంజ్’ పద్ధతి మన దేశంలో వద్దని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిందని బొత్స గుర్తుచేశారు.

Related posts