తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు సోమవారం వైసీపీ చీప్ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఉదయం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్తో కలిసి హైద్రాబాద్లోని లోటస్పాండ్లో జగన్ను కలుసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తాను టీడీపీని వీడి వైసీపీలో చేరినట్టు ఆయన చెప్పారు. వైసీపీలో ఏ హోదా ఆశించకుండానే పార్టీలో చేరానని స్పష్టం చేశారు. చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాలేదన్నారు.
కులాల వారీగా చంద్రబాబు వద్ద ఆర్మీ ఉంటుందని విమర్శించారు. ఏ కులం వారు విమర్శలు చేస్తే అదే కులానికి చెందినవారితో తిట్టిస్తారని రవీంద్ర బాబు ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినందునే హైద్రాబాద్ నుండి విజయవాడకు చంద్రబాబు పారిపోయి వచ్చారని ఆరోపించారు. దళితుడిగా ఉన్నందునే టీడీపీలో వివక్ష కొనసాగించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఒక్క సామాజిక వర్గం మాత్రమే టీడీపీ హయాంలో బాగుపడిందన్నారు. మిగితా అన్ని సామాజిక వర్గాలు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి బుద్ది చెబుతాయని ఆయన జోస్యం చెప్పారు.
పండగలకు ప్రత్యేక రైళ్లు అంటూ.. బాదేస్తున్నారా..