గత ఏడాది విష్ణు విశాల్, అమలాపాల్ నటించిన “రాక్షసన్” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి “రాక్షసుడు”గా రీమేక్ అవుతోంది. విష్ణు విశాల్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తుండగా, అమలాపాల్ పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో విష్ణు విశాల్ పాత్రను బెల్లంకొండ శ్రీనివాస్ భర్తీ చేయలేడని అమలాపాల్ చెప్పినట్టు వదంతులు వినిపించాయి. ఈ విషయం గురించి తెలుసుకున్న అమలాపాల్ స్పందించింది. తాను చెప్పని విషయాన్ని చెప్పినట్టుగా చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని, వదంతి, నిందకి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. అది మీ కళ్లకు తెలియలేదా? అని ట్వీట్ చేసింది అమలాపాల్.
మంచు విష్ణుపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు