హీరోయిన్ అమలాపాల్ పుదుచ్చేరిలో జరిగిన మారథాన్ పోటీల్లో పాల్గొన్నారు. ఊరికే వచ్చి ప్రారంభించి, జండా ఊపి వెళ్లిపోలేదు, ఆమె కూడా మారథాన్ లో పాల్గొని, 21 కిలోమీటర్ల దూరం పరిగెత్తింది. ఈ పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులకు ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఏటా నిర్వహించే మారథాన్ పోటీల్లో భాగంగా 10, 21, 40 కిలోమీటర్ల పరుగు పందాలు జరిగాయి. మందిర్ సెంటర్ నుంచి మారధాన్ ప్రారంభం కాగా, దాదాపు 3 వేల మందికి పైగా పాల్గొన్నారు.
రైల్వే శాఖ ఏటీజీపీ శైలేంద్రబాబు నేతృత్వంలో రైల్వే పోలీసుల బృందంతో పాటు మహిళా కమాండర్ల బృందం కూడా పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న అమలాపాల్, మొత్తం మారధాన్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.