2014లో హీరోయిన్ అమలాపాల్ కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి మధ్య విభేదాలు రావడంతో 2017లో విడాకులు తీసుకుని ఈ జంట విడిపోయింది. వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అమలాపాల్ సినిమాల్లో నటించే విషయమై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. విజయ్ నుంచి విడిపోయిన తర్వాత అమలాపాల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం అమలాపాల్ బోల్డ్ పాత్రలో నటించిన “‘ఆమె” చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఇటీవలే విజయ్ తాను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. డాక్టర్ ఐశ్వర్య అనే మహిళతో విజయ్ వివాహం ఈ నెలలో జరగబోతోంది. తాజాగా అమలపాల్ చేసిన ఓ ట్వీట్ తన మాజీ భర్తని ఉద్దేశించే ని అనుకుంటున్నారు. ఇంతకీ అమలాపాల్ ట్వీట్ ఏంటంటే “పోరాడతాను.. తట్టుకుని నిలబడతాను.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోను. నాపై నాకున్న నమ్మకమే నా బలం.. స్వేచ్ఛగా సంతోషంగా జీవించడం నాకు తెలుసు” అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చివర్లో ఆమె చిత్రంలో తన పాత్ర ఇదే అంటూ అమలాపాల్ పేర్కొంది.
previous post