telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అల్లు స్నేహారెడ్డి

Snehareddy

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మెగా డాటర్ సుస్మితా కొణిదెల విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి.. పిల్లలు అయాన్, అర్హలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని తమ నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం స్నేహారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ భూమిపై మనుషులకు ఎంత పాత్ర ఉందో.. ఇతర జీవాజాలానికి అంతే పాత్ర ఉంది. ప్రకృతి సమతుల్యంగా ఉన్నప్పుడే అందరం ఆనందంగా ఉంటాం’’ అని అన్నారు. ప్రకృతి సమతుల్యంగా ఉండటానికి మొక్కలు నాటడం ఒక్కటే సరైన మార్గమని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ భావించారు” స్నేహ అన్నారు. ఇంత మంచి ఆశయంతో ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం కావాలని స్నేహ ఆకాంక్షించారు. తెలంగాణ మొత్తం పచ్చని నేలగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతేకాకుండా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తనవంతుగా మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ను విసురుతున్నట్లు తెలిపారు. తన భర్త అల్లు అర్జున్, తన స్నేహితులు జూపల్లి మేఘనారావు (మైహోమ్స్ కన్‌స్ట్రక్షన్ డైరెక్టర్), ఆర్. సింగారెడ్డిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు స్నేహ నామినేట్ చేశారు. వీరంతా మొక్కలు నాటి మరికొంత మందిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేయాలని కోరారు.

Related posts