స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “అల వైకుంఠపురములో”. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని రెండు పాటలు విడులైన సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా “సామజవరాగమనా” సాంగ్ యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ పాట 7 లక్షలకి పైగా లైక్స్ ను యూట్యూబ్ లో దక్కించుకుంది. తెలుగులో ఓ పాటకి ఇన్ని లైక్స్ రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం “సామజవరగమనా” సాంగ్ షూటింగ్ కోసం యూనిట్ అంతా యూరప్లో ఉంది. అక్కడ బన్నీ లిడో డాన్సర్స్తో కలిసి స్టెప్పులేసారు. గత 25 సంవత్సరాలుగా ఎంతో ఫేమస్ అయిన లిడో డాన్స్ని బన్నీ చేయడంతో తాజాగా ఆయన ఖాతాలో మరో రికార్డ్ నమోదైంది. ఫస్ట్ టైమ్ పారిస్లో లిడో డాన్సర్స్తో డాన్స్ చేసిన సౌత్ఇండియన్ స్టార్గా అల్లు అర్జున్ గుర్తింపు పొందడం విశేషం.
previous post
ఫస్ట్ నీ సినిమాల్లో నువ్వు ఎక్స్పోజింగ్ తగ్గించు… మంచు లక్ష్మిపై జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు