telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ అభిమానులకు షాక్… “అల వైకుంఠపురంలో” టీంపై ఫైర్

AY

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “అల వైకుంఠపురములో”. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. తమన్‌ స్వరకర్త. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ “సామజవరగమన” సాంగ్ విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఇదే ఊపులో ఇప్పుడు రెండో పాటను విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సందర్భంగా అక్టోబర్ 21 సాయంత్రం 4 గంటలకు “రాములో రాములా…” అనే పాటను విడుదల చేస్తామని చెప్పారు. చేతిలో మందు గ్లాసుతో బన్నీ ఊపు చూస్తుంటే పాట పిచ్చెక్కించడం ఖాయం అని నమ్ముతున్నారు అభిమానులు. దానికోసం ఆశగా వేచి చూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేసాడు దర్శకుడు త్రివిక్రమ్. పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తుంటే.. మరో రోజు పాటు వాయిదా వేసారు. దీంతో పాట ఓ రోజు వాయిదా పడటంతో చిత్ర యూనిట్‌పై బన్నీ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.

Related posts