telugu navyamedia
సినిమా వార్తలు

పూజా కార్యక్రమాలతో త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా ప్రారంభం

bunny-and-trivikram

“నా పేరు సూర్య”తో భారీ డిజాస్టర్ ను చూసిన అల్లు అర్జున్ తన తరువాత సినిమా కోసం చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. ఇటీవల త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బన్నీ. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్, దర్శకనిర్మాతలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేశారు. గతంలో అల్లు అర్జున్ సరసన ఆమె “దువ్వాడ జగన్నాథం”లో నటించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ హిట్ ను అందుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై కూడా అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని చాలా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 24న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమం ముగించుకొని అల్లు అర్జున్ కారులో బయల్దేరారు. అది గమనించిన ఓ ఇద్దరు దివ్యాంగులు ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో వేచిచూస్తూ కారు ఆపి, తమతో ఫొటో దిగాలని రిక్వెస్ట్ చేశారు. ఆ ఇద్దరినీ గమనించిన బన్నీ వెంటనే కారు దిగి వారిని ఆప్యాయంగా పలకరించి వారితో ఫొటో దిగారు. దీంతో ఆ దివ్యాంగులు ఎంతో ఆనందించారు. ఇందుకు సంబందించిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు “మానవత్వానికి మారు పేరు అల్లు అర్జున్ (కింగ్ ఆఫ్ హ్యుమానిటీ)” అంటూ అల్లు అర్జున్ కు ఉన్న సహృదయాన్ని ప్రశంసిస్తున్నారు.

Related posts