telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా… ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Allu-Arjun

“నా పేరు సూర్య”తో భారీ డిజాస్టర్ ను చూసిన అల్లు అర్జున్ తన తరువాత సినిమా కోసం చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. ఇటీవల త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బన్నీ. అల్లు అర్జున్ 19వ చిత్ర‌మిది. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త‌దుప‌రి షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేశారు. గతంలో అల్లు అర్జున్ సరసన ఆమె “దువ్వాడ జగన్నాథం”లో నటించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ హిట్ ను అందుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై కూడా అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Related posts