telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వలస కార్మికులకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విరాళం

Stop-the-Walk

కరోనా మహమ్మారి రావడంతో రోజువారి వేతనంపై నెట్టుకొచ్చే ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఒక్కపూట తిండి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. ఇక వలస కార్మికుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో మొన్నటికి వరకు వలస కార్మికులు వేరే వేరు రాష్ట్రాల్లో చిక్కుకోగా.. ఇటీవలే తమ సొంత గ్రామాలను పయనమవుతున్నారు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. అయితే వాహనాల్లో వెళ్లేందుకు డబ్బులు కూడా లేని చాలా మంది వలస కార్మికులు.. తమ కాళ్లకు చక్రాలు కట్టుకొని ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. అందులోనూ ఎండాకాలం కావడంతో ఎంతో మంది అలసి సొలసి తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. వారి పరిస్థితి చూసి చాలా మంది చలించిపోతున్నారు.  ఇక కరోనా వేళ అన్ని ప్రభుత్వాలు ఆర్థికంగా ఎంతో చితికిపోయాయి. ఈ క్రమంలో వారిని మద్దతుగా సినిమా సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తమ తరఫున విరాళాలు ఇవ్వడంతో పాటు పలు విధాలుగా సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం సహాయం చేసేందుకు కొందరు ముందుకొస్తున్నారు. వలస కార్మికులకు పలుచోట్ల నీళ్లు, ఆహారం, చెప్పులు లాంటివి అందిస్తున్నారు. ఇందులో భాగంగా వారి కోసం ఓ ఎన్జీవో సహాయం చేస్తుండగా.. అందుకోసం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ డబ్బులు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన ఆయన చిన్న తనయుడు అల్లు శిరీష్‌.. వలస కార్మికుల కోసం సహాయం చేసేందుకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు.

Related posts