telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నేను సీఎం అయితే పార్కుల్లో అందరూ విచ్చలవిడిగా…” హీరోయిన్ కామెంట్స్

Rekha

15 ఏళ్ల క్రితం హీరో ఆకాష్ నటించిన ‘ఆనందం’ సినిమా హీరోయిన్ రేఖ ప్రముఖ కమెడియన్ ఆలీ హోస్ట్ చేస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసారు. ఈ సందర్భంగా ఆలీ ఆమెను ఓ ప్రశ్న అడిగారు. ‘నువ్వు సీఎం అయితే ఏం చేస్తావ్’ అని అడిగారు. ఇందుకు రేఖ తన సమాధానంతో అందరినీ షాక్‌కు గురిచేసారు. ‘నేను సీఎం అయితే పార్కుల్లో అందరూ విచ్చలవిడిగా తిరిగేలా చేస్తాను’ అన్నారు. ‘నేను మన్మథుడులో గెస్ట్ రోల్ చేసాను. నాగార్జున గారి కోసమే చేసాను. ఆ తర్వాత ఆయన కలిసి సినిమా చేద్దామన్నారు. ఆయన ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. నాగార్జున గారూ మీ ఫోన్ కోసం వెయిటింగ్. నేను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. మంచి అబ్బాయి కోసం వెయిటింగ్. అయితే కొన్నేళ్ల క్రితం నేను చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. బతికుండగానే శ్రద్ధాంజలి ఫొటో చూసుకునే ఛాన్స్ ఎవరికి వస్తుంది చెప్పండి. నేను ఒకరి ఇంటికి వెళ్లి.. మరుసటి రోజు వెళ్లిపోయేటప్పుడు న్యూస్ పేపర్ టేబుల్ మీద పెట్టి వెళ్లిపోతా. ఆ పేపర్‌లో నా గురించి వచ్చిన వార్త చూసి అయ్యో ఈ అమ్మాయి చనిపోయిందా అని షాక్ అవుతారు’’ అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు రేఖ.

Related posts