telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా!

Gongidi Sunitha mla trs

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ఈ మహమ్మారి బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడగా, తాజాగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా సోకినట్టు తేలింది.

గత కొన్ని రోజులుగా ఆమె జలుబుతో బాధపడుతుండగా గురువారం హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం వచ్చిన ఫలితాల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. సునీత వద్ద పనిచేసే ఇద్దరు సిబ్బందికి కూడా కరోనా సోకినట్టు తేలింది. దీంతో సునీత భర్త, మహేందర్‌రెడ్డితోపాటు మరికొందరికి పరీక్షలు నిర్వహించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఆందోళన కలిగించే స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 1892 కేసులు నమోదయ్యాయి

Related posts