స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “అల వైకుంఠపురములో”. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని రెండు పాటలు విడులైన సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం మూడో పాట టీజర్ను విడుదల చేసింది. పూర్తి సాంగ్ను నవంబర్ 22న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్కు మంచి క్రేజ్ ఏర్పడింది. లేటెస్ట్ సమాచారం మేరకు ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ ఆఫర్ దక్కిందట. రూ.19.50కోట్లకు ఈ హక్కులు అమ్ముడైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తుంది.
previous post
next post