telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో”తో పోటీకి సై అంటున్న బాలీవుడ్ ఖిలాడీ

Saaho

సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ హీరోగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న భారీ ఆక్షన్ ఎంటర్టైనర్, స్పై థ్రిల్ల‌ర్ “సాహో”. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ గ‌త‌ రికార్డులను బ్రేక్ చేస్తుంది. గ‌గుర్పొడిచే సన్నివేశాల‌తో పాటు చేజింగ్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ , మ‌ల‌యాళంతో పాటు ప‌లు భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి పోటీగా మ‌రే సినిమా ఉండ‌ద‌ని విశ్లేష‌కులు భావించారు. కానీ ఇలాంటి తరుణంలోనే అక్ష‌య్ కుమార్ “మిష‌న్ మంగ‌ల్‌”తో “సాహో”కు పోటీగా దిగుతున్నాడు. సోనాక్షి సిన్హా, విద్యాబాలన్‌, నిత్యామీనన్‌, తాప్సీ, కృతి కుల్హ‌రీ, ష‌ర్మ‌న్ జోషి లాంటి భారీ తారాగణంతో రాబోతోన్న “మిషన్‌ మంగళ్‌” చిత్రాన్ని “సాహో”కు పోటీగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ప్రారంభ‌మైన ఈ చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. స్పేస్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి స్వాతంత్య్ర దినోత్స‌వం రోజు సాహో, మిష‌న్ మంగ‌ల్ లాంటి రెండు పెద్ద సినిమాలు తలపడితే పరిణామం ఎలా ఉంటుందనేది.

Related posts