బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్కుమార్, కరీనాకపూర్, కైరా అద్వానీ, పంజాబీ నటుడు, సంగీత దర్శకుడు దల్జిత్ దోసంజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “గుడ్న్యూజ్”. అక్షయ్కుమార్-కరీనాకపూర్, దల్జిత్-కైరా అద్వానీ దంపతులుగా నటించారు. ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లలు కనేందుకు ఈ జంటలు యత్నించే క్రమంలో స్పెర్మ్స్ మార్పిడి జరిగి వాళ్లు ఎదుర్కొన్న సంఘటనలను హాస్యభరితంగా చిత్రీకరించారు దర్శకుడు రాజ్మెహతా. ఈ చిత్రాన్ని ఇండియాలో గతేడాది డిసెంబర్లో విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను దుబాయ్లో ఈ నెల 11న తిరిగి విడుదల చేయనున్నారు. సినిమాకు సంబంధించిన పోస్టర్ను అక్షయ్కుమర్ సోమవారం తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో విడుదల చేశారు. అలాగే, సినిమా విడుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘అభిమానుల్లారా మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను. ‘గుడ్న్యూజ్’ సినిమాను 11న తిరిగి విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేశాం. స్టే సేఫ్, స్టే ఎంటర్టైన్డ్’ అని అక్షయ్కుమార్ పోస్టర్కు క్యాప్షన్ ఇచ్చారు.
previous post
రెండో పెళ్ళికి సిద్ధపడుతున్న బోల్డ్ హీరోయిన్… ఎవరితో అంటే ?