అసోం లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల తాకిడికి ప్రజల జీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఈ కుండపోత వర్షాలతో, ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. బ్రహ్మపుత్ర వంటి నదులు పొంగిపొర్లుతుండడంతో దాదాపు 45 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 33 జిల్లాలు వరద బీభత్సంతో వణికిపోతున్నాయి. వీటన్నంటిని మించి వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కజిరంగ నేషనల్ పార్క్ 90 శాతం జలమయం అయింది. అందులోని లక్షలాది వన్యప్రాణుల పరిస్థితి ఏంటన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇలాంటి పరిస్థితులలో ఉన్న అసోంను చూసి చలించిపోయారు. వెంటనే అసోంకు రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అందులో కోటి రూపాయలు అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో కోటి రూపాయలు కజిరంగ నేషనల్ పార్క్ కు విరాళంగా అందించారు. అంతేగాకుండా, తాను సాయం చేశానని, మీరు కూడా సాయం చేయండి అంటూ అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.
కాపుల అన్యాయాలపై పవన్ ప్రశ్నించలేదు: ఎమ్మెల్యే జక్కంపూడి