శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా ఎకె సుధీర్ నంబూద్రి ఎంపికయ్యారు. మలప్పురం జిల్లా తిరూర్ తిరునవాయ అరీక్కరమనకు చెందిన సుధీర్ నంబూద్రి నవంబరు 17 నుంచి ఏడాదిపాటు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. శబరిమల సన్నిధానంతో పాటు మాలికాప్పురం దేవాలయాలకు ఆయన ప్రధాన పూజారిగా సేవలందిస్తారు.
ప్రస్తుత ప్రధాన పూజారి కందదారు మహేష్ మోహనారు, సన్నిధానం స్పెషల్ కమిషనర్ ఎం. మనోజ్, కమిషనర్ హెచ్.హర్షన్, దేవస్థానం అంబుడ్స్మెన్ జస్టిస్ రామన్, బోర్డు ప్రెసిడెంట్ ఎ.పద్మకుమార్, సభ్యులు తదితరులు సుదీర్ఘంగా సాగిన ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు.