నటుడిగా, నిర్మాతగా అలరించిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇప్పుడు దర్శకుడిగా మారేందుకు సిద్ధమయ్యారు. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘మేడే’ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. థ్రిల్లర్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదలైంది. చిత్రంలో అజయ్ దేవగణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుండగా, మిగతా కాస్ట్ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు . హైదరాబాద్లో ఈ చిత్రం తొలి షెడ్యూల్ జరుపుకోనుంది. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ డిసెంబర్ లో చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలియజేశారు. కాగా, అమితాబ్, అజయ్ దేవగణ్లు గతంలో ఆగ్, సత్యాగ్రహ, ఖాకీ, తీన్ పట్టి , మేజర్ సాబ్ అనే చిత్రాలలో నటించారు. కాగా ఈ అఫిషియల్ ప్రకటనతో బాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ కుదిరిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
previous post