అజయ్ దేవగన్ హీరోగా పాపులర్ కామెడీ చిత్రం ‘గోల్మాల్’ సిరీస్ లో మరో సినిమా రాబోతుంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ శనివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. రోహిత్ శెట్టి, తను పక్కపక్కనే నిలబడి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘హిందీలో కొనసాగుతున్న సుదీర్ఘ ప్రాచైజ్ మాత్రమే కాదు.. నాకిష్టమైన చిత్రం కూడా. మిమ్మల్ని నవ్వించడానికి మరో నవ్వుల అల్లరి ‘గోల్మాల్ 5′ రాబోతుంది’ అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సుభాష్ సర్కార్ తెరకెక్కించనున్నారు. బాలీవుడ్లో ప్రాంచైజ్గా రూపొందించడం మొదలు పెట్టింది ఈ చిత్రంతోనేనని ఈ నిర్మాణ సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. 2006లో మొదటి చిత్రం ‘గోల్మాల్’ రూపొందింది. అప్పటి నుంచి 2008లో ‘గోల్మాల్ రిటర్న్స్’, 2010లో ‘గోల్మాల్ 3’, 2017లో ‘గోల్మాల్ అగైన్’ విడుదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ప్రాంచైజ్ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంది.
ఇందులో మొదటి చిత్రంలో అజయ్ దేవగన్, అర్షద్ వర్షి, శర్మన్ జోషి, తుషార్ కపూర్, రిమి సేన్, పరేష్ రావల్ లీడ్ రోల్స్ పోషించారు. మూడు భాగాల్లోనూ వీళ్లే నటించారు. ‘గోల్మాల్ అగైన్’లో మాత్రం కునాల్ ఖేము, శ్రేయాస్ తల్పాడే, పరిణీతి చోప్రా, టబు, ప్రకాష్ రాజ్ వంటి వారు ప్రవేశించారు. ఈ ఐదో చిత్రంలో ఎవరు లీడ్ రోల్స్ పోషిస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ ‘తానాజి : ది అన్సంగ్ వారియర్’లో నటించారు. మరాఠి మిలట్రి నాయకుడు తానాజి మలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో సైఫ్ అలీఖాన్, కాజోల్, జగపతిబాబు, పంకజ్ త్రిపాఠి వంటివారు నటించారు.