telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐశ్వ‌ర్య‌రాయ్ సంచలన నిర్ణయం..!

ఐశ్వర్య రాయ్ అందానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. 1994లో మాజీ మిస్ వ‌రల్డ్ కిరీటాన్ని అందుకున్న ఐశ్వ‌ర్య‌రాయ్ నాలుగు ప‌దుల‌ వ‌య‌స్సులోను కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటోంది. అయితే…తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారంట. ఐశ్వర్య తన కమ్‌బ్యాక్‌ను మని రత్నం తాజా సినిమాతో చేయనున్నారంట. ఈ స్టార్ దర్శకుడు తాజాగా తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య చేస్తున్నారంట. అది కూడా రెండు పాత్రల్లో చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఈ రెండు పాత్రలు మందాకిని దేవి, నందిని పాత్రలుగా చెబుతున్నారు. అంతేకాకుండా వీటిలో ఒకటి పక్కా పాజిటివ్ అని మరొకటి నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో చియాన్ విక్రమ్, జయమ్ రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమనులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కల్కి కృష్ణమూర్తి నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం దర్శకుని డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారంట. ఈ సినిమా గురించి మరిన్ని వివరాల కోసం వేచి చూడాలి.

Related posts