హాలీవుడ్ అందాల తార ఏంజెలీనా జోలి నటించిన తాజా చిత్రం మాలిఫిసెంట్: మిస్ట్రన్ ఆఫ్ ఈవిల్. అక్టోబర్ 18న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశారు. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల కాగా దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్లోను మూవీని విడుదల చేస్తుండగా, హిందీ వర్షెన్కి సంబంధించిన ట్రైలర్ని రీసెంట్గా విడుదల చేశారు. ఇందులో ఏంజెలీనా పాత్రకి ఐశ్వర్యరాయ్ డబ్బింగ్ చెప్పడం మనం గమనించవచ్చు. అంతేకాదు ట్రైలర్ ప్రారంభంలో డిఫరెంట్ గెటప్లో కనిపించిన ఐష్.. అందరు ఇప్పటి వరకు నా ప్రేమని చూశారు. ఇక నుండి నుండి నా కోపాన్ని, ద్వేషాన్ని చూస్తారు అని అంటుంది. ఐష్ లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిత్రంలో ఏంజెలినా దుష్టజీవి పాత్రలో నటిస్తుంది. జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని వాల్ట్ డిస్నీ నిర్మిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్పై మీరు ఓ లుక్కేయండి.
next post
మంచు ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది..