telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్.. 3జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు

Telecom Company Airtel No less rates

టెలికం కంపెనీలో రోజు రోజుకు పెరిగిపోతున్న పోటీనీ తట్టుకొని వినియోగదారులను కాపాడుకునేందుకు ఆయా కంపెనీలు కొత్త ప్లాన్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా దేశంలోని అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.148తో సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 3జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. కాలపరిమితి 28 రోజులు. ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ టీవీ యాప్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కర్ణాటక సర్కిల్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.

Related posts