టెలికం కంపెనీలో రోజు రోజుకు పెరిగిపోతున్న పోటీనీ తట్టుకొని వినియోగదారులను కాపాడుకునేందుకు ఆయా కంపెనీలు కొత్త ప్లాన్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా దేశంలోని అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.148తో సరికొత్త ప్లాన్ను ప్రకటించింది. ఈ ప్లాన్లో 3జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. కాలపరిమితి 28 రోజులు. ఈ ప్లాన్తో ఎయిర్టెల్ టీవీ యాప్, వింక్ మ్యూజిక్ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కర్ణాటక సర్కిల్లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.
previous post
next post