telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

పెరిగిన .. ఢిల్లీ – శ్రీనగర్ మధ్య విమాన చార్జీలు..

air charges raised delhi-srinagar

ఢిల్లీ – శ్రీనగర్ నగరాల మధ్య విమాన చార్జీల ధరలు ఆకాశన్నంటాయి. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లే విమాన సర్వీసు టికెట్ సాధారణ ధర గతంలో ఐదువేల రూపాయలుండగా ఇప్పుడు అమాంతం ఐదురెట్లు పెరిగింది. మంగళవారం ఢిల్లీ – శ్రీనగర్ విమాన టికెట్ ధర 15,500 నుంచి 24,500 రూపాయల దాకా పెరిగింది.

ఈ వారంలో ఢిల్లీ -శ్రీనగర్ విమాన చార్జీ 13వేలరూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. ముంబయి నుంచి శ్రీనగర్ విమానటికెట్ 24,150 నుంచి 41,000రూపాయలకు పెరిగింది. సాధారణంగా ముంబయి-శ్రీనగర్ విమాన టికెట్ ధర 9 నుంచి 12వేల రూపాయలుండేది. అదికాస్తా గణనీయంగా పెరిగింది. పుల్వామా ఘటన అనంతరం విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, వచ్చే కొన్ని రోజుల వరకు శ్రీనగర్ మార్గంలో టికెట్లు విక్రయించామని ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశ్వనీ లోహాని వెల్లడించారు.

Related posts