telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఎంఐఎంకే ఎక్కువ ఎమ్మెల్యేలు .. ప్రతిపక్ష హోదా కోరుతాం: ఎంపీ అసద్‌

MIM Leader Asad meet CM KCR

తెలంగాణ అసెంబ్లీలో  కాంగ్రెస్‌ పార్టీ కన్నా ఎంఐఎంకే ఎక్కువ ఎమ్మెల్యేలు  ఉన్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎంకు ప్రతిపక్షహోదా కోరుతూ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కలవనున్నట్లు  ఓవైసీ తెలిపారు.  

 

రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం అవతరించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కన్నా ఎంఐఎంకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఇదే విషయాన్నిస్పీకర్ ను  కలసి వివరించి సభలో ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందిగా విన్నవిస్తామనని తెలిపారు.

Related posts