telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిర్మాత అవతారమెత్తనున్న కీర్తి సురేష్

Keerthy

‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మిస్ ఇండియా’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ అమ్మడు అటు తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ‘అన్నాత్తే’ చిత్రంలో, తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలు చేస్తుంది. కీర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “గుడ్‌ లక్‌ సఖి “, అదే విధంగా యంగ్ హీరో నితిన్ తో ‘రంగ్ దే ‘ చిత్రంలోనూ నటిస్తుంది. అంతేకాదు కీర్తి మరో అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ “రాఘవన్-2″లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంది కీర్తి. కాగా కీర్తి సురేష్‌ ఇప్పుడు నిర్మాతగా మారి ఒక వెబ్‌ సిరీస్‌ను రూపొందించడానికి కీర్తి సిద్దమౌతోంది. కథ బాగా నచ్చడంతో తమిళ వెబ్‌ సిరీస్‌ను నిర్మించాలని కీర్తి ఫిక్స్‌ అయ్యింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది. కీర్తి తండ్రి సురేశ్ కుమార్ కూడా నిర్మాత అన్న విషయం తెలిసిందే.

Related posts