telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ కి సీక్వెల్ రాబోతుందా…?

ajent

నవీన్ పొలిశెట్టి హీరోగా గతేడాది సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఈసినిమా విడుదలైన ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి స్వరూప్ ఆర్ఎస్‌జే దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని ఫిల్మ్ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది. నవీన్ పొలిశెట్టి. పోలీసులకు కూడా అంతుచిక్కని కేసుల్ని ఛేదించే ఏజెంట్‌గా నవీన్ నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మరి ఇలాంటి చిత్రానికి కొనసాగింపు రూపొందితే.. అంచనాలు భారీగా ఉంటాయి. దాంతో అంతకు మించిన కథను సిద్ధం చేయాలి. దర్శకుడు స్వరూప్, నవీన్ ప్రస్తుతం దీనికి సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నారట. స్క్రిప్ట్ పక్కాగా రూపొందించే పనిలో ఉన్నారని టాక్.

Related posts