telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఈశ్వర్ రెడ్డి కన్నుమూత

eashwar reddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన సీనియర్ రాజకీయవేత్త అగరాల ఈశ్వర్ రెడ్డి (87) కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వర్ రెడ్డి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1933 డిసెంబర్ 28న చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో జన్మించారు.

1957లో తూకివాక గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన అగరాల, అనంతరం కాలంలో ఎమ్మెల్యేగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా, స్పీకర్ గా వ్యవహరించారు. అయితే, 1983లో టీడీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. తిరుపతిలో ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓడిపోయారు.

Related posts