మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో వివాదం చెలరేగింది. నరేష్ పనితీరుపై జీవిత రాజశేఖర్ మధ్య అసహనం వ్యక్తం చేయడంతో వివాదం కోర్టు వరకు వెళ్లింది. నరేష్ పని తీరుపై చర్చించి, సమస్యలు పరిష్కరించుకుందామంటూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ మెంబర్లకు జీవితారాజశేఖర్ దంపతులు మెసేజ్ పెట్టారు. అయితే ఈ సమావేశంపై నరేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటే నరేష్ తరపు లాయర్ రాజశేఖర్ను ప్రశ్నించారు. ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని, ఫ్రెండ్లీ సమావేశమనేనని జీవితారాజశేఖర్ చెబుతున్నారు.
నేడు జరగనున్న సమావేశంలో నరేష్ 9 నెలల్లో చేసిన పనులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న రూ. 5.5 కోట్లనే నరేష్ ఖర్చు చేస్తున్నారని, మూలధనంలో రూపాయి కూడా జమ చేయలేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘మా’లో వివాదాలు రాజుకున్న నేపథ్యంలో ‘మా’ గౌరవ సలహాదారు యు.వి. కృష్ణం రాజు స్పందించారు. 25 ఏళ్లుగా అందరూ మెచ్చుకునేలా ‘మా’ ఉందని, ఇకపై కూడా అలాగే గౌరవంగా ఉండేలా అందరూ కలిసి చర్చించుకుని ఈ మీటింగ్లో నిర్ణయాలు తీసుకోవాలని కృష్ణంరాజు హితబోద చేశారు. ఈ వివాదానికి నేటితో ఫుల్స్టాప్ పెట్టాలని ఆయన సూచించారు.