ఓ దుండగుడు టెక్సాస్లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో 21 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ముగ్గురు పోలీసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితులను ఒడెస్సాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతిచెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగుడు పోస్టల్ వ్యాన్ చోరీ చేసి వాహనం డ్రైవింగ్ చేస్తూనే ప్రజలపై కాల్పులకు జరిపాడు.
సుశాంత్ డ్రగ్స్ కోసం వేధించేవాడు… రియా సంచలన వ్యాఖ్యలు