తెలుగులో సంచలన విజయం సాధించిన “అర్జున్ రెడ్డి” చిత్రంతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం రీమేక్ “కబీర్ సింగ్”తో బాలీవుడ్కు పరిచయం అయ్యాడు సందీప్. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన “కబీర్ సింగ్” బాలీవుడ్ లో రికార్డ్ లు క్రియేట్ చేసింది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రంపై విమర్శకులు పెదవి విరిచినా ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. కాగా… సందీప్ రెడ్డి వంగా తర్వాతి ప్రాజెక్ట్కి సంబంధించి కొన్నాళ్ళుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబుతో సినిమా అని కొందరు చెప్పుకొస్తుండగా, మరి కొందరు సల్మాన్తో సినిమా చేయనున్నాడని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి తదుపరి ప్రాజెక్ట్ రణ్బీర్ కపూర్తో ఉంటుందని బీటౌన్ టాక్. ఇటీవల సందీప్ .. టీ సిరీస్ అధిపతి భూషణ్ కుమార్ని కలిసి స్టోరీ నరేట్ చేశారట. ఆయనకి కథ నచ్చడంతో సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా విషయంలో రణ్బీర్తో చర్చలు జరిపినట్టు కూడా సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. రణ్బీర్ కపూర్ ప్రస్తుతం బ్రహ్మాస్త్రా, షంషెరా చిత్రాలతో పాటు లవ్రంజన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
previous post
next post
బిగ్బాస్ షో..ఓ బూతు ప్రోగ్రాం..