అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించగా రూపొందిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఎవరు”. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహించారు. ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు రాబట్టుకోవడమే కాకుండా, హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్లు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. మూడు వరుస హిట్ లను సాధించి, హ్యాట్రిక్ హీరోగా నిరూపించుకున్న అడవి శేష్, తాజా వీడియో ఒకటి వైరల్ అవుతోంది. జనసేన అధినేత పవర్ స్టార్ పిల్లలు అకీరా, ఆద్యాలతో తాను సరదాగా ఆడుకుంటున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా, ఇప్పుడు దాన్ని పవన్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. అయితే అకీరా, ఆద్యాలను ఎప్పుడు, ఎక్కడ కలిశాడన్న విషయం తెలియదుగానీ… వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రియల్ లైఫ్ లో బిడియం కలిగిన అమ్మాయినే… : రాశిఖన్నా