“అర్జున్ రెడ్డి” చిత్రం సెన్సేషనల్ హిట్ కొట్టడంతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. దీంతో “అర్జున్ రెడ్డి” చిత్రం తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో తమిళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. “ఆదిత్యవర్మ” అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఒరిజినల్ వర్షెన్కి సంగీతం అందించిన రధన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్గా రవి కె చంద్రన్ పని చేస్తున్నారు. ధృవ్ విక్రమ్ సరసన అక్టోబర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ4 ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటీవల సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు `ఏ` సర్టిఫికేట్ను జారీ చేశారు. అయితే చిత్ర నిర్మాత సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. సినిమా ప్రేక్షకులకు మరింత చేరువవ్వాలి అంటే యూఏ సర్టిఫికేట్ అయితే బెటర్ అని భావిస్తున్నారట. అందుకే సెన్సార్ సభ్యులతో యూఏ సర్టిఫికేట్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. అవసరమైతే రిలీజ్ వాయిదా వేసైనా యూఏ సర్టిఫికేట్తోనే ఆదిత్యవర్మను రిలీజ్ చేసేందుకుప్లాన్ చేస్తున్నారట. ముందుగా ఈ సినిమాను నవంబర్ 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తాజా నిర్ణయంతో రిలీజ్ మరితం ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమా నిర్మాతల నిర్ణయంతో మరింత ఆలస్యం కానుంది.
పెళ్లిపై శృతి హాసన్ స్పందన