telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అదిరింది” టీమ్ ఎందుకు వెనక్కి తగ్గినట్లు ?

jabardasth

ఏదైనా పండగ వచ్చిందంటే చాలు టాలీవుడ్ బుల్లితెరపై పలు షోల హంగామా మాములుగా ఉండదు. అయితే ఇప్పటికే “జబర్దస్త్” ప్రేక్షకులను అలరిస్తుండగా… “అదిరింది” షోతో ప్రేక్షకుల మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు నాగబాబు. మల్లెమాల ఎంటర్టైన్‌మెంట్స్ ఈటీవీతో కలిసి ఈ ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత పలు చానల్స్ ఇదే బాటలో నడిచినా అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఈసారి ఉగాది పండుగకు ‘జబర్దస్త్’ బ్యాచ్…”పండగ సార్..పండగ అంతే” తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. వీళ్ళకి పోటీగా ‘అదిరింది’ బ్యాచ్ “బాబుగారి ఇంట్లో బుట్ట భోజనం”తో బరిలోకి దిగింది. ఈ రెండీటి మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ “బాబుగారి ఇంట్లో బుట్టభోజనం” పండగ రోజు కాకుండా.. మార్చి 22న ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రసారమవుతుందని ప్రోమోలో వెల్లడించింది. స్వీటీ అనుష్క స్పెషల్ అప్పిరియన్స్, అందాల అనసూయ క్లాసికల్ డ్యాన్స్, నాగబాబు డాటర్ నిహరిక స్పెషల్ స్కిట్, ఇస్మార్ట్ సత్తి టిపికల్ కామెడీ లాంటి స్పెషాలిటీస్ ఉన్నప్పటికి… రేటింగ్స్‌ ద్వారా ఎవరో గొప్పో తేలిపోయే సమయం వచ్చినప్పుడు..ఇలా వెనకడుగు వెయ్యడం సరికాదని చెప్పుకుంటున్నారు. గతంలో అందరూ కలిసి ఉన్న సమయంలో ఈటీవీలో ‘సకుటుంబ సపరివార సమేతంగా’ పేరుతో..ఇదే తరహా కార్యక్రమాన్ని చేశారు. ఆ థీమ్‌తో ప్రస్తుతం “బాబుగారి ఇంట్లో బుట్టభోజనం”  కార్యక్రమానికి రూపకల్పన చేశారని కూడా వార్తలొస్తున్నాయి.

Related posts