telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రియా.. ప్లీజ్‌ ఆండ్రీని మ‌రీ ఇబ్బంది పెట్టకు… నెటిజన్ల రిక్వెస్ట్

Shriya

ప్రపంచవ్యాప్తంగా కరోనా వణికిస్తుండడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సెలెబ్రిటీలంతా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు జాగ్రత్తలు చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రియ ఈ జాబితాలో చేరారు. కరోనా నేపథ్యంలో శ్రియ, ఆండ్రీ జంట ఇంట్లోనే ఉంటూ హోమ్‌ క్వారంటైన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా శ్రియ భర్త ఆండ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరు కరోనా సూచనలు చేస్తున్న సైన్‌బోర్డులను షేర్‌ చేశాడు. ‘ఇంట్లోనే ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకొండి.. సామాజిక దూరం పాటించండి’ వంటి సూచ‌న‌లను శ్రియ చేయగా.. ఆమె భ‌ర్త అండ్రీ మాత్రం.. ‘నన్ను ఆమె బారీ నుంచి కాపాడండి.. నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంది.. ఏదో ఒక ప‌ని చేయిస్తూనే ఉంది అంటూ జాలిగా ముఖం పెట్టి నెటిజన్లను అడుగుతున్నాడు. అయితే వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ‘శ్రియా.. ప్లీజ్‌ ఆండ్రీకి రోజంతా ప‌ని చెప్పి మ‌రీ ఇబ్బంది పెట్టకు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా 2018లో శ్రియ బార్సిలోనా టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండ్రీ కొచ్చిన్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం శ్రియా ఆమె భ‌ర్త ఆండ్రీ కలిసి ర‌ష్యాలోనే ఉంటున్నారు.

 

View this post on Instagram

 

True love #stayathome @andreikoscheev

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

Related posts