telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్‌ కేసు : బోరున విలపించిన సంజన

Sanjana

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన శాండల్‌వుడ్‌ నటి సంజనా గల్రానిని బుధవారం సీసీబీ పోలీసులు మడివాళ ఎఫ్‌ఎస్‌ఎల్‌ కార్యాలయానికి తీసుకురాగా, మహిళా సీఐ అంజుమాల బృందం సంజనాను విచారించారు. నిందితుడు రాహుల్‌ ఇచ్చిన సమాచారంతో సంజనాను విచారించారు. 34 మంది పెద్ద వ్యక్తుల పుత్రుల పేర్లను సంజనా సీసీబీకి వెల్లడించిన్నట్లు సమాచారం. ఆమె చెబుతున్నదాంట్లో నిజమెంతో తెలుసుకొంటున్నారు. మహిళా సాంత్వన కేంద్రంలో రాగిణి ద్వివేదిని మహిళా సీఐ కాత్యాయని ప్రశ్నించారు. బెంగళూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో పాటు సినిమా, బుల్లితెర, వ్యాపారవేత్తల పుత్రులున్నట్లు తెలిసింది. ఇతర నిందితులు వీరేన్‌ ఖన్నా, రాహుల్‌ నిర్వహించిన పార్టీలలో రాజకీయ, వ్యాపార, సినిమా రంగాల బడాబాబులు పాల్గొనేవారని సంజనా తెలిపింది. తను తప్పు చేశానని సంజన ఆవేదన చెందినట్లు సమాచారం. తనను మీడియా ముందు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సంజన పట్టుబట్టగా అధికారులు ఒప్పుకోలేదు. నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రాని కేసుల గొడవతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. తనకు రాత్రి భోజనం వద్దని చెప్పిన సంజనా ఇదంతా నా కర్మ అంటూ బోరున విలపించినట్లు తెలిసింది. బెంగళూరు డైరీ సర్కిల్‌లోని మహిళా సాంత్వన కేంద్రంలో వీరిద్దరినీ ఉంచారు.

Related posts