telugu navyamedia
సినిమా వార్తలు

తిరుమల శ్రీవారి సేవలో సమంత

Samnatha

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత సరికొత్త లుక్ లో కనిపించనుంది. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.మరో మూడు రోజుల్లో తాను నటించిన “ఓ బేబీ” చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో సమంత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున చిత్ర ద‌ర్శకురాలు నందినీరెడ్డితో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం వెలుపలికి రాగా, భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందనే నమ్మకం ఉందని సమంత అన్నారు.

Related posts