ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ, వరుస విజయాలను అందుకుంటున్న పూజ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కెరీర్ తొలినాళ్లలోనే ఈ ‘మొహెంజోదారో’ బ్యూటీ బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. అయితే అక్కడ పూజా ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో తెలుగులో గ్లామర్ గేట్లు ఎత్తేసి, స్టార్ హీరోయిన్గా మారిపోయింది. రీసెంట్ గా ‘అల వైకుంఠపురములో’ మెరిసి ఆకట్టుకుంది ఈ బుట్టబొమ్మ. అయితే పూజా హెగ్డే మళ్లీ రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.3కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్తో ‘రాధేశ్యామ్’, అఖిల్తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లో నటిస్తున్న పూజాకు ఇంకా అనేక ఆఫర్లు వరుస కడుతున్నాయి. ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్హిట్లు సాధించడంతో హీరోలు, దర్శక నిర్మాతలు ఆమెను లక్కీ హీరోయిన్గా భావిస్తున్నారు. దీంతో ఈ బ్యూటీ అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని కరాఖండిగా చెప్పేస్తోందట. దానికి తోడు గతంలో కంటే రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తన వద్దకు వచ్చే దర్శక నిర్మాతలకు రూ.2.5-3 కోట్ల వరకు ఇవ్వాలని చెప్పడంతో నోరెళ్లబెడుతున్నారట. కరోనా ఎఫెక్ట్తో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో పెద్ద నటులు, టెక్నీషియన్స్ పారితోషికంలో కోత విధించుకోవాలని ఇండస్ట్రీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.
next post