telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ బయోపిక్ కు ‘నో’ చెప్పిన నిత్యామీనన్

Nitya

ఒలింపిక్స్ లో భారత్ కు పతకాన్ని సంపాదించి పెట్టిన ఈ తెలుగుతేజం కరణం మల్లీశ్వరి బయోపిక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. నిన్న ఆమె జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. కరణం మల్లీశ్వరి మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో భారతీయ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై ఇనుమడింపజేసిన క్రీడాకారిణి. ఎంవీవీ సత్యనారాయణతో కలసి ఈ బయోపిక్ ను తాను నిర్మిస్తున్నట్టు ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రకటించారు. దీనికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఇక పాన్ ఇండియా చిత్రంగా దీనిని నిర్మించాలని నిర్మాతలు భావిస్తున్నందున ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించడానికి సత్తా వున్న నటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రముఖ నటి నిత్యా మీనన్ ను నటించాల్సిందిగా దర్శక నిర్మాతలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఆమె ఈ ఆఫర్ ని ఎందుకు తిరస్కరించిందన్న దానిపై కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts