telugu navyamedia
సినిమా వార్తలు

“జబర్దస్త్”కు కొత్త కళ… జడ్జిల పారితోషికం ఎంతో తెలుసా ?

Meena-and-Sekhar-Mastar

బుల్లితెరపై పాపులర్ అయిన “జబర్దస్త్” కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంతగానో ప్రజాదరణ పొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ ఈ ప్రోగ్రాంకు నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఈ షోలో కొత్త జడ్జిలు అలనాటి అందాల తార మీనా, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కన్పిస్తున్నారు. ఏప్రిల్ 5న వచ్చిన ప్రోమోలో వీరిని పరిచయం చేశారు “జబర్దస్త్” నిర్వాహకులు. ఈ షో కోసం మీనా ఎంత పారితోషికాన్ని డిమాండ్ చేసిందనేది ఆసక్తికరంగా మారింది. మీనా లక్షన్నర డిమాండ్ చేసిందట. షోకి కొత్తదనం తీసుకురావడం కోసం యాజమాన్యం కూడా అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. శేఖర్ మాస్టర్ కూడా ఇదే రేంజ్ లో అందుకుంటున్నారని సమాచారం. రోజా ఇప్పటివరకు ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయలు తీసుకుంటే మీనా మాత్రం లక్షన్నర డిమాండ్ చేసిందన్న మాట. అయితే వీరు ఈ షోకు శాశ్వతంగా జడ్జీలుగా వ్యవహరిస్తారా ? లేకపోతే కొద్ది కాలమేనా ? అనేది తెలియాల్సి ఉంది. రోజా, నాగబాబు ఎన్నికల కారణంగా బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వారు జబర్దస్త్ షోకి దూరమైనట్లు తెలుస్తోంది.

Related posts