‘అందాలరాక్షసి’ లావణ్య త్రిపాఠి దాదాపు యంగ్ హీరోలు అందరితోనూ నటించింది. లావణ్య ప్రస్తుతం యంగ్ హీరో కార్తికేయ సినిమాతో పాటు మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. అయితే ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లకు ఆదరణ పెరగడంతో ఆమె చూపు అటువైపు మళ్లినట్లు తెలుస్తోంది. లావణ్య ఈ ఏడాది ఓటీటీలోకి ఆరంగ్రేటం చేస్తున్నట్లు సమాచారం. ఆమె కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా దర్శకుడు మారుతితో కలిసి పని చేయనున్నారు. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్లో లావణ్య త్రిపాఠి నటించనున్నట్లు తెలిసింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావనతో ఈ వెబ్సిరీస్ తెరకెక్కనుందని, ఇందులో లావణ్య పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని టాక్. కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దాని ప్రాధాన్యాన్ని గుర్తించిన రమ్యకృష్ణ, ప్రియమణి, సమంత, నిత్యామీనన్ వంటి తారలు డిజిటల్ ప్లాట్ఫామ్వైపు మొగ్గుచూపారు. దీంతో ఇప్పుడు ఆ జాబితాలో లావణ్య త్రిపాఠి చేరనున్నారు.
previous post
పెళ్ళైన వ్యక్తితో సంబంధం… సంచలన విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్