ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇన్నాళ్లూ షూటింగ్ల కారణంగా బిజీబిజీగా గడిపిన అందరూ ఇప్పుడు అనుకోకుండా లభించిన ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. తమకు నచ్చిన పనులు చేస్తున్నారు. కొందరు హీరోయిన్లు వంట గదిలో ప్రయోగాలు చేస్తున్నారు. `మహానటి`తో జాతీయ ఉత్తమ నటిగా మారిపోయిన హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఓ సరికొత్త వంటకాన్ని అభిమానులకు పరిచయం చేసింది. స్వయంగా చాక్లెట్ దోశ వేసింది. `సండే ఈజ్ ఫన్ డే` అంటూ ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.
previous post
next post