అమలాపాల్ విడాకులకు కారణం ధనుష్ అనే వార్త తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. విడాకుల తరువాత ఈ బ్యూటీ సినిమాలతో బిజీ గా మారింది. దర్శకుడు విజయ్, సినీ నటి అమలా పాల్ కొన్నేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లైన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి తర్వాత కూడా అమల సినిమాల్లో నటిస్తాను అన్నందుకు అత్తింటివారు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే అమల, విజయ్ విడిపోవడానికి అసలు కారణం సూపర్స్టార్ రజినీకాంత్ అల్లుడు, సినీ నటుడు ధనుషేనంటూ విజయ్ తండ్రి షాకింగ్ ఆరోపణలు చేశారు.‘అమల, విజయ్ విడిపోవడానికి కారణం ధనుషే. ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్ బార్ ఫిలింస్పై ‘అమ్మ కనక్కు’ అనే సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. ఇందులో అమలా పాల్ను హీరోయిన్గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత నటించకూడదని అమల నిర్ణయించుకుంది. సరిగ్గా అప్పుడే ధనుష్ ఈ ఆఫర్ను అమలకు ఇవ్వడంతో ఆమె సినిమాకు ఓకే చెప్పింది. ముందు సినిమాలు చేయనని చెప్పి ఆ తర్వాత ఇంట్లో వారితో ఒక్కమాటైనా చెప్పకుండా సినిమాకు ఓకే చేయడం విజయ్కు నచ్చలేదు. దాంతో వారి దాంతప్య జీవితాల్లో విభేదాలు వచ్చాయి. అందుకే విడిపోయారు’ అని వెల్లడించారు.ఈ విషయంపై తాజాగా అమలా పాల్ ఓ మీడియా ద్వారా స్పందించారు. విడాకులు నిర్ణయం తనదేనని, ఈ విషయంలో ధనుష్ ప్రమేయం లేదని తెలిపారు. ధనుష్ తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపారు. అమల బాలీవుడ్లో అడుగుపెట్టేసారు. తొలి సినిమాలోనే మహేష్ భట్ దర్శకత్వంలో అలనాటి తార పర్వీన్ బాబి బయోపిక్లో నటించే అవకాశం దక్కించుకున్నారు.