మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో కొద్ది రోజులుగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న ‘ఉప్పెన’ విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా విడుదల ఆగింది. అయితే తొలిసినిమా ఉప్పెన విడుదల కాకుండానే రెండో సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించడానికి ఓకే చెప్పేశాడని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ బాగుంటే మినిమం బడ్జెట్ చిత్రాలను నిర్మించే సంస్థ యువీ క్రియేషన్స్. ఈ బ్యానర్లో వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమా చేయబోతున్నాడని టాక్. ఈ సినిమాను కూడా ఓ కొత్త డైరెక్టరే తెరకెక్కించబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి.
previous post