గత కొంత కాలంగా చిత్రపరిశ్రమకు చెందిన పలువురు అనారోగ్య కారణాలతో మరణించిన సంఘటనలు ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టాయి. నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది.ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోజు ఉదయం 8.30 నిమిషాలకు ఆమె తుదిశ్వాస విడిచారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో పడుతున్న ఆమెకు బసవతారకం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
పుట్టెడు దు:ఖంలో ఉన్న ఉత్తేజ్ ను మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. పద్మావతి మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా భార్య మరణంతో ఉత్తేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మెగాస్టార్ సహా పలువురు నటులు ఉత్తేజ్ ఆయన కుమార్తెలను ఓదార్చే ప్రయత్నం చేశారు. మెగాస్టార్ సహా పలువురు నటులు ఉత్తేజ్ ఆయన కుమార్తెలను ఓదార్చే ప్రయత్నం చేశారు.
కాగా..ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్ కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.
ఆ వార్తలన్నీపుకార్లే… చై- సామ్ విడాకులపై నాగార్జున క్లారిటీ