telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తనుశ్రీ దత్తా న్యాయవాదిపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Thanu shree

బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమంతో పెను దుమారం రేపింది. నానా పాటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ఊపందుకుంది. నానా పాటేకర్‌పై కేసులో తనుశ్రీ దత్తా తరపున న్యాయవాది నితిన్‌ సాట్పుటే వాదించారు. అయితే తాజాగా న్యాయవాది నితిన్‌ సాట్పుటేపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బాంద్రా పశ్చిమ సబర్బ్‌ ప్రాంతంలో ఓ మహిళను దుర్భాషలాడినందుకుగాను కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయం వెలుపల తనును అసభ్య పదజాలంతో దూషించినట్లుగా 47 ఏళ్ల ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ సమావేశం నిమిత్తం మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై సెక్షన్‌ 354ఏ తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై న్యాయవాది స్పందిస్తూ… ఫిర్యాదుపై దర్యాప్తు జరుగుతుందన్నారు.

Related posts