telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్త దర్శకుడికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్

Sharwanand

శర్వానంద్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శర్వా తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. శ్రీరామ్ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కాగా ఇటీవల ‘జాను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన ’96’ సినిమాకు రీమేక్ గావచ్చింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ ‘మహాసముద్రం’ అనే సినిమా చేస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శర్వాతో పాటు సిద్దార్థ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘శ్రీకారం’ అనే సినిమాను చేస్తున్నాడు. వీటితో పాటు మరో సినిమాను కూడా అనౌన్స్ చేసాడు ఈ యంగ్ హీరో. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ”ఆడాళ్లూ.. మీకు జోహార్లు” అనే సినిమాలో శర్వా నటిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘చిత్రలహరి’ ‘రెడ్’ వంటి సినిమాలను రూపొందించిన కిషోర్ తిరుమల ఈ సినిమాతో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

Related posts