telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లక్ష్మణరేఖ దాటుతున్నారు… లాఠీ లకు బలవుతున్నారు… సాయి కుమార్ షార్ట్‌ ఫిలిం వైరల్

saikumar

కరోనా మహమ్మారిని అరికట్టడానికి తెలుగు సినిమా స్టార్లు తమ వంతు బాధ్యతగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు.  ప్రజలను ఆదుకోవడానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతోన్న సినీ కార్మికులను ఆదుకోవడానికి తన వంతుగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఇటీవల 5 లక్షల నాలుగు రూపాయలను విరాళం ఇచ్చారు. అలాగే మరో 2 లక్షల ఎనిమిది రూపాయలను డబ్బింగ్ యూనియన్‌కు అంజేశారు. ఇప్పుడు తన కొడుకు ఆది, కూతురు జ్యోతిర్మయితో కలిసి కరోనా వైరస్ మీద అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తలు చెబుతూ సాయి కుమార్ ఒక షార్ట్ ఫిలిం తీశారు. జ్ఞాపిక ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ఈ షార్ట్ ఫిలింను నిర్మించింది. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. కరోనా మహమ్మరిని నియంత్రించడానికి డాక్టర్లు, పోలీస్ శాఖ, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి మరువలేనిది. వాళ్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం పనిచేస్తున్నారు. కానీ, ఇప్పటికీ కొంత మంది ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టి వీధుల్లోకి వస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ షార్ట్ ఫిలింలో ప్రస్తావించారు. డాక్టర్ల ప్రతినిధిగా జ్యోతిర్మయి, పారిశుద్ధ్య కార్మికుల ప్రతినిధిగా ఆది, పోలీసులకు ప్రతినిధిగా సాయి కుమార్ ఈ షార్ట్‌ ఫిలింలో కనిపించారు.

Related posts