telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఖైరతాబాద్ కు పోటెత్తిన ప్రభాస్ అభిమానులు… కారణం ఇదే…!!

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కొత్త కారు కొన్నారు. దాని రిజిస్ట్రేషన్ కొరకు ప్రభాస్‌ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన్ని చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఇక ఆర్టీఏ ఆఫీసు సిబ్బంది, ఫ్యాన్స్ ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఫొటోలు దిగేందుకు అక్క‌డి జ‌నం ఉత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డంతో వారితో ప్రభాస్ ఫొటోల‌కు పోజిచ్చారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్ మూవీలో నటిస్తున్నారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అలాగే తన 21వ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కత్వంలో చేయ‌నున్నారు. హీరోయిన్గా దీపికా ప‌దుకొనే నటిస్తుండగా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

Related posts