telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

జయరాం హత్యకేసులో… విచారణ ఎదుర్కొన్న నటుడు పింగ్ పాంగ్ సూర్య ..!

ping pong surya inquired on jayaram case

జయరాం హత్య కేసు రోజుకో రకంగా మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్‌రెడ్డిని పోలీసు కస్టడీకి కోర్టు అనుమించడంతో… మూడు రోజుల కస్టడీలో భాగంగా జూబ్లీహిల్స్ పోలీసులు రాకేష్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. జయరాం హత్యకు దారితీసిన విషయాలపై రాకేష్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు సినీనటుడు పింగ్ పాంగ్ సూర్య… జయరాం హత్య కేసులో సూర్యను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తాజాగా, ఈ హత్య కేసులో ‘ఆ నలుగురు’ నటుడు సూర్య ప్రసాద్ ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

చిగురుపాటి హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్‌రెడ్డికి పింగ్ పాంగ్ సూర్య స్నేహితుడు కాగా.. గత నెల 30వ తేదీన రాకేష్‌రెడ్డి ఇంటికి పింగ్ పాంగ్ సూర్య వెళ్లివచ్చినట్టు తెలుస్తోంది. దీనితో సూర్యను పిలిపించిన బంజారాహిల్స్ పోలీసులు అతడిని విచారించారు. ఈ హత్యకేసుతో సంబంధం ఉన్న మరికొందరిని నేడు విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు.

Related posts